Telugu Global
Telangana

గాంధీభవన్‌లో రచ్చ.. తన్నుకున్న కాంగ్రెస్‌ నేతలు

ఏఐసీసీ సెక్రటరీ, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జి మన్సూర్ అలీ ఖాన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీర్ ఉల్లా ఖాన్‌ హాజరయ్యారు.

గాంధీభవన్‌లో రచ్చ.. తన్నుకున్న కాంగ్రెస్‌ నేతలు
X

కాంగ్రెస్ నేతలు మరోసారి రచ్చకెక్కారు. ఈసారి ఏకంగా గాంధీభవన్‌ వేదికగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో గాంధీభవన్‌ రణరంగంగా మారింది. హైదరాబాద్ పార్లమెంట్‌ స్థానానికి సంబంధించిన సమన్వయ సమావేశం ఈ రచ్చకు కారణమైంది.

ఏఐసీసీ సెక్రటరీ, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జి మన్సూర్ అలీ ఖాన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీర్ ఉల్లా ఖాన్‌ హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళతో పాటు ఇతర నేతలు రావడంతో కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాలుగా విడిపొయిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.


ఇన్‌ఛార్జి మన్సూర్‌ అలీ ఖాన్‌ రెండు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. దీంతో హైదరాబాద్‌ పార్లమెంట్ అభ్యర్థి సమీర్‌ ఉల్లా ఖాన్‌ అసహనంతో గాంధీ భవన్‌ నుంచి వెళ్లిపోయారు.

First Published:  6 May 2024 2:21 PM GMT
Next Story